30 శాతం మార్కెట్ వాటా
NHAI లెక్కల ప్రకారం.. PayTm FASTag భారతదేశం అంతటా ఎనిమిది కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులతో 30 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఫాస్ట్ట్యాగ్ అనేది భారతదేశంలో NHAI నిర్వహించే ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ. లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాల నుండి నేరుగా టోల్ చెల్లింపులను అనుమతించడానికి ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఫాస్ట్ట్యాగ్లను జారీ చేయగల అధీకృత బ్యాంకుల జాబితాలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, IDBI బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్ వంటివి ఉన్నాయి.