తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్ MLC బల్మూరి వెంకట్ ఉచిత బస్సులో అసెంబ్లీకి చేరుకోగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆటోలో వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు బల్మూరి వెంకట్. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బ తింటోందన్నారు. అందుకే అసెంబ్లీకి ఆటోలో వచ్చి నిరసన తెలిపానని పేర్కొన్నారు.