తెలంగాణలో నూతంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై.. YCP ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నుంచి తీవ్రస్థాయిలో ప్రతిదాడులు వస్తున్నాయి. బీజేపీ ఆదేశాలతోనే ఏపీ సీఎం జగన్, BRS అధినేత కేసీఆర్ పనిచేస్తున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. వ్యాపారులను కేసీఆర్, కేటీఆర్ అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఎంపీనా లేక బ్రోకర్ హా అని ప్రశ్నించారు. కేసీఆర్ కాళ్లు మెుక్కిన వ్యక్తి విజయసాయి అని ఆరోపించారు.