Wednesday, October 23, 2024

1 + 1 నుంచి 2 + 2… వైఎస్ షర్మిల భద్రత పెంపు-ap government has increased the security of ys sharmila ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

వైఎస్ షర్మిల అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ భద్రతను టూ ప్లస్ టూ గా మార్చినట్లు కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. భద్రతా ప్రమాణాల(స్కేల్) మేరకు భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఎవరైనా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని… వారికి గన్ మెన్లను కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం వారు ఇచ్చే సిఫారసు(సెక్యూరిటీ రివ్యూ కమిటీ) నివేదిక మేరకు గన్ మెన్లను కేటాయించడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఎవరైనా భద్రతను అడిగితే వివరాలను పరిశీలించి… ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana