ది కేరళ స్టోరీలో అసలు ఏముంది?
ది కేరళ స్టోరీ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా.. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించారు. కేరళకు చెందిన 32,000 మంది హిందూ అమ్మాయిలను మోసపూరితంగా కొందరు ఇస్లాం మతంలోకి మార్చి.. ఐసిస్లోకి పంపారని ది కేరళ స్టోరీ సినిమా ట్రైలర్లో ఉండటంతో తీవ్ర దుమారం రేగింది. అయితే, కేరళకు చెందిన ముగ్గురు అమ్మాయిల యథార్థ కథ ఇది అని గత వారం ప్రోమోను మార్చింది ఆ చిత్ర యూనిట్.