Sunday, October 27, 2024

సర్పంచ్ పదవీకే వన్నె తెచ్చారు

సర్పంచ్ పదవీకే వన్నె తెచ్చారు
-బెల్కటూరు సర్పంచ్ మధుకు ఘన సన్మానం
-మీ ఆధారభిమానికి కృతజ్ఞతలు
– తాజా మాజీ సర్పంచ్ మదన్ మోహన్

తాండూర్ ఫిబ్రవరి 4 జనవాహిని :- తాండూర్ మండలం బెల్కటూరు గ్రామ సర్పంచ్ మధన్ మోహన్ వార్డు సభ్యులను గ్రాస్తులు, యువకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఆదివారం రోజు గ్రామంలోని రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోల సమావేశం నిర్వహించారు. అనంతరం పలువురు నాయకులు, అభిమానులు మాట్లాడుతూ గడిచిన ఐదేండ్ల పదవి కాలంలో గ్రామ అభివృద్ధితో పాటు ప్రజలకు అందుబాటులో ఉండి ఎంతో మంది మన్ననలు పొందరని చెప్పారు. అలాగే మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన తదుపరి గ్రామ అభివృద్ధి విషయంలో అనుకున్న ప్రతి పనిని సాధించే పట్టుదల గల సర్పంచ్ గా సేవాలందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరణ్ కోట్ మాజీ యంపిటిసి నర్సయ్య గౌడ్, యంపిటిసిలు
సాయిరెడ్డి, వసంత్ కుమార్, నాయకులు ఉమా శంకర్,స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంనర్సింహా రెడ్డి,ఉపాధ్యాయుడు నారాయణ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana