ఆదుకున్న గిల్, అక్షర్
మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (13), యశస్వి జైస్వాల్ (17)ను ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పెవిలియన్కు పంపాడు. శ్రేయస్ అయ్యర్ (29) కాసేపు నిలిచినా.. రజత్ పటిదార్ (9) విఫలమయ్యాడు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ తరుణంలో భారత బ్యాటర్లు శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్ ఆదుకున్నాడు. నిలకడగా ఆడుతూనే పరుగులు రాబట్టారు. శుభ్మన్ గిల్ 132 బంతుల్లోనే శతకాన్ని చేరి అదరగొట్టాడు. టెస్టు క్రికెట్లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో వికెట్కు గిల్, అక్షర్ 89 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వెనువెంటనే ఇద్దరూ ఔటయ్యారు.