కొత్త కుండలో పాయసం తయారుచేసి పొంగలి నైవేద్యం పెడతారు. కనుక తమిళనాడులో పొంగల్ అంటారు. పాలు పొంగినట్లే ఇంట్లో సిరులు పొంగుతాయని భావిస్తారు. ధాన్యలక్ష్మి సూర్యదేవుని అనుగ్రహం వలన రేగుపండ్లు, చెరకుగడలు, నారింజ, దానిమ్మ పండ్లు నివేదన చేయాలి. పూజ చేయించిన బ్రాహ్మణునికి, గుడి దగ్గర పూజారికి దక్షిణ తాంబూలాదులతో, కూష్మాండ దానం సంక్రాంతి నాడు చేయడం విశేష పుణ్యం. ఈ దానం వల్ల భూదాన ఫలం అనుగ్రహిస్తాడు సూర్యభగవానుడు. శక్త్యానుసారం వస్త్రాలు, గొడుగు, పాదరక్షలు, నువ్వుండల దానం పుణ్యప్రదాలు. ఈరోజు ధాన్యలక్ష్మి పూజ, కోడిపందేలు, ఎడ్లపందేలు, గాలిపటాల పందేలు జరుగుతాయని చిలకమర్తి తెలియచేశారు.