Home ఎంటర్టైన్మెంట్ హనుమాన్ ని తీసేస్తున్నారు..ప్రెస్ నోట్ కూడా రిలీజ్

హనుమాన్ ని తీసేస్తున్నారు..ప్రెస్ నోట్ కూడా రిలీజ్

0

అతి తక్కువ కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన అగ్ర హీరోలందరితోను సినిమాలు నిర్మించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. అలాగే సొంతంగా  డిస్ట్రిబ్యూషన్ అనే సంస్థని కూడా నెలకొల్పి బయట సినిమాలని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఇటీవలే  సలార్ ని రిలీజ్ చేసిన ఆ సంస్థ తాజాగా  హనుమాన్ ని కూడా తమ సంస్థ ద్వారానే రిలీజ్ చేసింది. కానీ  ఇప్పుడు ఆ సంస్థ హనుమాన్ విషయంలో చేసిన ఒక కంప్లైంట్ సంచలనం సృష్టిస్తుంది.

నైజాం ఏరియాలో హనుమాన్ కి సంబంధించి  మైత్రి సంస్థ కొన్ని థియేటర్స్ తో  ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం హనుమాన్ ని థియేటర్ ఓనర్స్ తమ థియేటర్లలో ప్రదర్శించాలి. కానీ థియేటర్ ఓనర్స్ హనుమాన్ ని ప్రదరించడం లేదు. పైగా పక్కాగా అగ్రిమెంట్ చేయించుకున్నా కూడా హనుమాన్ ప్రదర్శనని నిలిపివేశారు. దీంతో మైత్రి మూవీ మేకర్స్ తమకి జరిగిన అన్యాయాన్ని నిర్మాత మండలి దృష్టికి తీసుకొచ్చింది. పైగా  థియేటర్స్ వారు తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్ధికంగా కూడా చాలా నష్టపోయామని  మైత్రి సంస్థ ఆరోపించింది. 

 

ఇప్పుడు ఈ అంశాలన్నిటినీ ప్రస్తావిస్తు నిర్మాత మండలి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇలాంటి చర్యలు తెలుగు చిత్ర పరిశ్రమకు మనుగడకే చాలా ప్రమాదమని థియేటర్ ఓనర్స్ న్యాయాన్ని గౌరవిస్తు ఒప్పందం ప్రకారం వెంటనే హనుమాన్ ని ప్రదరించాలని అలాగే నిర్మాతకి డిస్ట్రిబ్యూటర్ కి  జరిగిన నష్టాన్ని కూడా థియేటర్స్ వాళ్లే భరించాలని చెప్పింది

Exit mobile version