ఎమ్మెల్సీ పదవి హామీతోనే టికెట్ రేసు నుంచి పక్కకు తప్పుకున్నట్లు పార్టీ వర్గాల్లో ఓ అభిప్రాయం ఉంది. ఇపుడు ఎన్నికల షెడ్యూలు విడుదల కావండంతో మరో మారు అద్దంకి దయాకర్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారిలో షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, సంపత్, మధు యాష్కీ గౌడ్ వంటి నాయకులు వీరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఒక్క ముస్లిం మైనారిటీ నాయకుడు కూడా ఎమ్మెల్యేగా లేరు. అదే మాదిరిగా ఎమ్మెల్సీలు కూడా లేరు. మంత్రి వర్గంలోకి ఒక ముస్లిం మైనారిటీ నేతను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలపై కన్నేసిన కాంగ్రెస్ కు ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకం కానున్నాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసకుంటే ఈ ముగ్గురిలో ఒకరికి తక్షణం అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు.