Sunday, October 27, 2024

Hyderabad | 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆతిథ్యం

హైదరాబాద్ లో బుధవారం రాత్రి కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద 13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకె, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు ఈ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి సీఎం స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వ ప్రాధాన్యతలు వివరించారు. ‘అభయహస్తం’ కింద అన్ని వర్గాల అభ్యున్నతికి నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ సర్కారు కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana