నిర్మాణ సమయంలో అనేక సవాళ్ళు
రామ మందిర నిర్మాణ పునాది సమయంలో అనేక సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. భూసార పరీక్ష నిర్వహించినప్పుడు ఇక్కడ భారీ కట్టడాలు నిర్మించేందుకు అనువుగా లేదని తేలింది. అడుగు భాగం ఇసుకతో ఉండటం వల్ల కష్టంగా మారింది. దీంతో నేషనల్ జియోగ్రాఫికల్ సర్వే, ఐఐటీ ఢిల్లీ, గువాహతీ, చెన్నై, రూర్కె, ముంబై, ఎల్ అండ్ టీకి చెందిన నిపుణులు అందరూ కలిసి దీనికి ఒక పరిష్కారం ఆలోచించారు. పునాది వేయడానికి ముందు భూమి లోపల సుమారు 14 మీటర్ల మేర ఇసుకని తొలగించారు.