అమావాస్య రోజున శివుడ్ని పూజించడం వల్ల శని దేవుని చెడు ప్రభావం తగ్గుతుంది. శివుడికి పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. శని సడే సతీ, దయ్యా చెడు ప్రభావం, పితృ దోషం, కాలసర్ప దోషం నుంచి బయట పడేందుకు శివలింగానికి బిల్వ పత్రాలు, గంగాజలం, పచ్చి పాలతో అభిషేకం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం నెలకొంటుంది.