ముందే చనిపోయాడా?..
తన కుమారుడిని తాను హత్య చేయలేదని, తాను నిద్ర నుండి లేచి చూసేటప్పటికే తన కుమారుడు చనిపోయి ఉన్నాడని బెంగళూరు స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ (Suchana Seth) పోలీసులకు తెలిపారు. తన కుమారుడంటే తనకు ఎంతో ప్రేమ అని, అకస్మాత్తుగా అతడు చనిపోవడంతో షాక్ కు గురయ్యానని, మృతదేహం పక్కనే చాలా సేపు కూర్చున్నానని ఆమె పోలీసులకు తెలిపారు. ఆ బాధలో తన చేతిపై కత్తితో గాయం కూడా చేసుకున్నానని చెప్పారు. అయితే, ఆమె వాదనను పోలీసులు విశ్వసించడం లేదు.