అశ్వగంధ పొడిలో యాక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. ఇవి శరీరంలో చేరిన ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని కాపాడతాయి. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి శరీర కణాల పునరుత్పత్తికి సహాయపడతాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు అశ్వగంధ పొడిని పాలల్లో కలుపుకుని తాగడం చాలా మంచిది. ఇది మెదడును అభివృద్ధి పరచడంలో ముందుంటుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలలో ఒక టీ స్పూన్ అశ్వగంధ పొడి, ఒక స్పూను తేనె వేసి పిల్లల చేత తాగించండి. ఈ పాలు గోరువెచ్చగా ఉండేలా చూడండి. కేవలం నెల రోజుల్లోనే వారి ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుంది.