ఈ నెల 11న వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. తనతోపాటు మరో 5 అసెంబ్లీ సీట్లను కేశినేని నాని కోరినట్లు తెలుస్తోంది. విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసినేని శ్వేతకు, విజయవాడ పశ్చిమ నుండి ఎమ్మెస్ బేగ్కు అవకాశం కల్పించాలని కోరినట్టు తెలుస్తోంది. నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుండి నల్లగట్ల స్వామి దాసుకు, మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు టిక్కెట్లు కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేశినేని నానికి మాత్రమే విజయవాడ పార్లమెంటు టిక్కెట్ భరోసా లభించినట్టు తెలుస్తోంది.