Tuesday, October 22, 2024

MLA Bala Krishna | ప్రశ్నించే వారిపై వైసీపీ దాడులు.. అంగన్వాడీలకు అండగా టీడీపీ

న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరవధిక నిరసన తెలుపుతున్న అంగన్వాడీలకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మద్దతు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన బాలయ్య.. ఆ పార్టీ చేసిన అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ఇందుకు ఉరవకొండలో పాత్రికేయులపై దాడి నిదర్శనమన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana