ఇది పాదయాత్ర కాదు.. బస్సు యాత్ర
రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత న్యాయ యాత్ర వివరాలను కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ లు మీడియాకు వివరించారు. ఈ యాత్ర భారత్ జోడో యాత్ర (Bharat jodo yatra) తరహాలో పాదయాత్రగా సాగదని వారు తెలిపారు. భారత న్యాయ యాత్ర బస్సులో కొనసాగుతుందన్నారు. అయితే, మధ్య మధ్యలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతారని తెలిపారు. ఈ యాత్రలో మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో రాహుల్ పర్యటిస్తారన్నారు.