మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. రోగనిరోధక శక్తిని బలంగా మార్చే శక్తి సముద్రపు చేపలకు ఉంది. సముద్రంలో పెరిగే చేపలు, రొయ్యలు, పీతలు వంటి వాటిలో జింక్ అధికంగా ఉంటుంది. జింక్ అధికంగా ఉండే వీటిని తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఈ సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు వంటి వాటిలో విటమిన్ ఏ, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, సెలీనియం అధికంగా లభిస్తుంది. ఇవి మన శరీరాన్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి. మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి.