సింగరేణిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరామ్పూర్, మంచిర్యాల, రామగుండం ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఐదు గంటల తర్వాత కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికలు జరిగిన కేంద్రాలలో ఏర్పాట్లు చేశారు. రాత్రి 11గంటలకు ఎన్నికల ఫలితాలు వెలువడతాయని అంచనా వేస్తున్నారు.