అమెరికా పర్యటన
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు జూన్ నెలలో అమెరికా, ఈజిప్ట్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించారు. మొదట జూన్ 20న అమెరికా వెళ్లారు. జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా (yoga) దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జూన్ 22న ప్రధాని మోదీకి వైట్ హౌజ్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఘనంగా స్వాగతం పలికారు. అదేరోజు అమెరికా పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం అమెరికా నుంచి ఈజిప్ట్ పర్యటనకు వెళ్లారు.