Saturday, February 28, 2026

చిట్టి చేతుల్లో విజ్ఞాన దీపాలు…!

-

spot_img
  • భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి…! 
  • పెరుమాళ్ల వెంకట్ రెడ్డి
  •  శ్రీ సాయి మేధ విద్యాలయంలో వైభవంగా సైన్స్ ఎగ్జిబిషన్
  • ​ఆకట్టుకున్న విద్యార్థుల నమూనాలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : విద్యార్థులు చదువుతో పాటు సృజనాత్మకతపై దృష్టి సారించాలని, చిన్న వయసు నుంచే నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని శ్రీ సాయి మేధ విద్యాలయం కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తాండూరు పట్టణం శివాజీ చౌక్‌లోని పాఠశాల ప్రాంగణంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల సైన్స్ నమూనాలు, వర్కింగ్ మోడల్స్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తాము తయారు చేసిన ప్రయోగాల గురించి అనర్గళంగా వివరిస్తూ అందరినీ అబ్బురపరిచారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, సర్ సి.వి. రామన్ కనిపెట్టిన ‘రామన్ ఎఫెక్ట్’ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఆయన స్ఫూర్తితో విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని కోరారు. విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories