- విద్యుత్ షాక్తో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి..!
- ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యుత్ షాక్తో మృతి
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఇంట్లో విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన విషాద ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..ఉదయాన్నే జరిగిన ప్రమాదంయాలల మండలానికి చెందిన మహమ్మద్ ప్రస్తుతం రాసనం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం తన నివాసంలో పని నిమిత్తం విద్యుత్ స్విచ్ బోర్డు, వైర్లను గమనిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ ఘాతానికి గురయ్యారు. షాక్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.తీవ్ర అస్వస్థతకు గురైన మహమ్మద్ను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే, పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.మహమ్మద్ మృతితో ఆయన పనిచేస్తున్న రాసనం గ్రామంలోని పాఠశాల విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఒక మంచి ఉపాధ్యాయుడిని కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






