Friday, February 20, 2026

నామినేషన్ వేసిన నర్సిములు

-

spot_img
  • మున్సిపల్ బరిలో పట్లోళ్ల నర్సింహులు
  • 10వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

​జనవాహిని ప్రతినిధి తాండూరు :- తాండూరు మున్సిపల్ ఎన్నికల వేడి ఊపందుకుంది. మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు బి.ఆర్.ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పట్లోళ్ల నర్సింహులు బుధవారం తన తొలి సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి తన మద్దతుదారులతో కలిసి వెళ్లిన ఆయన, అధికారికంగా నామినేషన్ పత్రాలను అందజేశారు.​ఈ సందర్భంగా పట్లోళ్ల నర్సింహులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మరియు స్థానిక నేతల సహకారంతో తాండూరులో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు బి.ఆర్.ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. 10వ వార్డులోని ప్రతి గల్లీలో మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రజల సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.​సాయిపూర్ ప్రజల ఆశీస్సులతో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు సంఘీభావం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories