Saturday, February 21, 2026

చిన్న వయసు.. పెద్ద లక్ష్యం…!

-

spot_img
  • జాతీయ ఖో-ఖో క్రీడాకారిణి శ్రీలక్ష్మికి ఎమ్మెల్యే ఘన సన్మానం
  •  అక్షర స్కూల్ విద్యార్థిని ప్రతిభకు ప్రశంసల జల్లు
  •  పీఈటీ రవీందర్ రెడ్డి సేవలకు ప్రత్యేక గుర్తింపు

జనవాహిని ప్రతినిధి తాండూరు : జాతీయ స్థాయి ఖో-ఖో పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన తాండూరు అక్షర హైస్కూల్ విద్యార్థిని కె. శ్రీలక్ష్మిని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. 77వ గణతంత్ర వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శ్రీలక్ష్మిని శాలువా మరియు మెమెంటోతో సత్కరించి అభినందించారు.ఖో-ఖో అండర్-14 జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి, శ్రీలక్ష్మి అసాధారణ ప్రతిభ చాటిందని ఎమ్మెల్యే కొనియాడారు. చిన్న వయసులోనే జాతీయ స్థాయికి చేరుకోవడం తాండూరు ప్రాంతానికే గర్వకారణమని పేర్కొన్నారు. నిరంతర సాధనతో భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.అనంతరం అక్షర హైస్కూల్‌లో నిర్వహించిన అభినందన సభలో విద్యార్థిని శ్రీలక్ష్మితో పాటు, ఆమెను తీర్చిదిద్దిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు రవీందర్ రెడ్డి, ఆర్. గోపాల్‌లను పాఠశాల యాజమాన్యం మరియు వివిధ స్వచ్ఛంద సంస్థలు ఘనంగా సన్మానించాయి. క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిని విజేతలుగా నిలుపుతున్న పీఈటీల కృషిని పలువురు వక్తలు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిల్ మెంబర్ సోమశేఖర్ తో పాటు లయన్స్ క్లబ్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్, బచ్‌పన్ ఛారిటబుల్ ట్రస్ట్, ట్రాస్మా రాష్ట్ర, జిల్లా మరియు తాండూరు యూనిట్ సభ్యులు, ఫ్రెండ్స్ గ్రూప్, రాథోడ్ యువసేన, మరియు క్రిస్టియన్ మెథడిస్ట్ చర్చ్ ప్రతినిధులు పాల్గొన్నారు.చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్న అక్షర స్కూల్ ప్రిన్సిపాల్ మోహన్ కృష్ణ, ఎండి యూనస్, సి. ప్రవీణ్ కుమార్, పి. రవీందర్ రెడ్డి, శోభారాణి, శ్రీకాంత్ తదితరులు విద్యార్థినిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories