<p>Producer Nagavamshi Reacts On Rumours : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచుతూ ఎప్పటికప్పుడు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ని ఇస్తూ వస్తున్నారు మూవీ టీమ్. ఇటీవలే గుంటూరు కారం మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి సినిమా నుండి రెండు పాటలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో తాజాగా విడుదలైన ఓ మై బేబీ సాంగ్ పై పలు విమర్శలు వచ్చాయి.</p>
<p>ఈ విషయం కాస్త పక్కన పెడితే సితార నిర్మాత నాగ వంశీ ఈ మధ్య ప్రతీ ప్రెస్ మీట్ లోనూ ‘గుంటూరు కారం’ సినిమా గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ కంటే ఎక్కువగా తన కామెంట్స్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఎన్ని సినిమాలు వచ్చినా సంక్రాంతి గుంటూరు కారం సినిమాదే అంటూ తేల్చి చెప్పేశాడు. అలా తన కామెంట్స్ తో సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు ఎవరైనా సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేసినా దానిపై రియాక్ట్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘గుంటూరు కారం’ సినిమా గురించి ఓ రూమర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. ఈ రూమర్ పై నాగ వంశీ కాస్త ఘాటుగానే స్పందించాడు.</p>
<blockquote class=”twitter-tweet”>
<p dir=”ltr” lang=”en”>Dear, <br />Super Fans and Movie-lovers, <a href=”https://twitter.com/hashtag/GunturKaaram?src=hash&ref_src=twsrc%5Etfw”>#GunturKaaram</a> film has 4 full songs and one bit song. We have finished shooting for 3 songs and one bit song. We are going to shoot for the last song from 21st December as per our Schedule. <br /><br />The recent “news” is fake and very monotonous…</p>
— Naga Vamsi (@vamsi84) <a href=”https://twitter.com/vamsi84/status/1736446969135145027?ref_src=twsrc%5Etfw”>December 17, 2023</a></blockquote>
<p>
<script src=”https://platform.twitter.com/widgets.js” async=”” charset=”utf-8″></script>
</p>
<p>గుంటూరు కారం సినిమా నుంచి ఒక మాస్ సాంగ్ విషయంలో మహేష్ బాబు సంతృప్తిగా లేడని, మూవీ టీంని పిలిచి మరి ఈ సాంగ్ పై రీవర్క్ చేయమన్నాడనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. అంతేకాదు మహేష్ బాబు సాంగ్ మార్చమని త్రివిక్రమ్, తమన్ లకు సీరియస్ గా చెప్పాడంటూ కొన్ని రూమర్స్ వైరల్ అవ్వడంతో దీనిపై నాగ వంశీ స్పందిస్తూ..” డియర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్, మూవీ లవర్స్.. గుంటూరు కారం సినిమాలో నాలుగు పాటలు ఒక బిట్ సాంగ్ ఉంది. ఇప్పటికే మూడు పాటలు, బిట్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయింది. డిసెంబర్ 21 నుంచి 4వ సాంగ్ షూటింగ్ కి వెళ్తున్నాం. అన్ని షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మకండి. వాళ్లు క్లిక్స్ కోసం అలాంటివి రాస్తుంటారు. మేము సైలెంట్ గా ఉన్నామని మీరు స్ప్రెడ్ చేసే ప్రతి రూమర్ నిజమైపోదు” అంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చాడు.</p>
<p>దీంతో ఈ ట్వీట్స్ ని మహేష్ ఫ్యాన్స్ రీ ట్వీట్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ‘గుంటూరు కారం’ సినిమా విషయానికొస్తే.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యామర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాలో మహేష్ బాబు ని కంప్లీట్ మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయబోతున్నారు. శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం 2024 జనవరి 12 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.</p>
<p>Also Read : <a title=”శ్రీలీలా షాకింగ్ నిర్ణయం – షూటింగ్స్‌కు బ్రేక్, కారణం ఇదేనట!” href=”https://telugu.abplive.com/entertainment/cinema/sreeleela-takes-a-break-from-his-movie-shooting-to-complete-mbbs-exams-134041″ target=”_blank” rel=”noopener”>శ్రీలీలా షాకింగ్ నిర్ణయం – షూటింగ్స్‌కు బ్రేక్, కారణం ఇదేనట!</a></p>
Guntur Kaaram: ఆ వార్తలను నమ్మకండి – ‘గుంటూరు కారం’ రూమర్స్పై నిర్మాత నాగవంశీ క్లారిటీ
Related Posts
*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
ఎమ్మెల్యేపై అలిగిన కాంగ్రెస్ కార్యకర్తలు -పార్టీ ప్రచారానికి దూరంగా కార్యకర్తలు
ఎమ్మెల్యేపై అలిగిన కాంగ్రెస్ కార్యకర్తలు -పార్టీ ప్రచారానికి దూరంగా కార్యకర్తలు తాండూర్ ఏప్రిల్ 20 :- వచ్చేనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమం శనివారం రోజు తాండూర్ప్రా మండలంలో ప్రారంభమైంది. అందులో భాగంగా మండలంలోని ఎల్మకన్య గ్రామంలో నిర్వహిస్తున్న…