19.6 C
New York
Saturday, May 18, 2024

Buy now

OTT: ఆమిర్ ఖాన్ నిర్మించిన కామెడీ డ్రామా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏ ప్లాట్‍‍ఫామ్‍లోకి రానుందంటే..

Laapataa Ladies OTT: ‘లాపతా లేడీస్’ సినిమా ట్రైలర్‌తో ఆసక్తిని రేపింది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఆమిర్ ఖాన్ కూడా ఈ మూవీ నిర్మాతల్లో ఉన్నారు. లాపతా లేడీస్ సినిమా ఈ ఏడాది మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. తక్కువ బడ్జెట్‍తో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి మంచి వసూళ్లే దక్కాయి. ఈ లాపతా లేడీస్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.

స్ట్రీమింగ్ వివరాలివే

లాపతా లేడీస్ సినిమా రేపు (ఏప్రిల్ 26) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ నేడు ప్రకటించింది. స్ట్రీమింగ్‍కు తీసుకురానున్న ఒక్క రోజు ముందు సడెన్‍గా ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ వెల్లడించింది.

ఈ అర్ధరాత్రి (ఏప్రిల్ 26) నుంచి లాపతా లేడీస్ సినిమా స్ట్రీమింగ్‍కు రానుందని సోషల్ మీడియా వేదికగా నెట్‍ఫ్లిక్స్ ప్రకటించింది. “తాజా కబురు, తప్పిపోయిన మహిళలు దొరికారు. ఈ అర్ధరాత్రి నుంచి నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలవుతుంది” అని ట్వీట్ చేసింది. స్ట్రీమింగ్‍కు వచ్చే కొన్ని గంటల ముందు విషయాన్ని వెల్లడించింది.

లాపతా లేడీస్ మూవీ గురించి..

లాపతా లేడీస్ చిత్రంలో నితాశీ గోయల్, స్పర్శ్ శ్రీవాత్సవ్, ప్రతిభా రత్న, ఛాయా కదమ్, రవికిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. గీతా అగర్వాల్ శర్మ, సతేంద్ర సోనీ, భాస్కర్ ఝా, దావూద్ హుస్సేన్ కీరోల్స్‌లో కనిపించారు. కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. పాజిటివ్ టాక్ వచ్చింది.

లపతా లేడీస్ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో 2023 సెప్టెంబర్‌లోనే ప్రదర్శితమైంది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం సుమారు రూ.20 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది.

లపతా లేడీస్ మూవీని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, కిండ్లింగ్ పిక్చర్స్, జియో స్టూడియోస్ బ్యానర్లపై ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతీ దేశ్‍పాండే సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి రామ్ సంపత్ సంగీతం అందించారు. కొత్తగా పెళ్లయిన ఇద్దరు వధువులు అనుకోకుండా ఒకరి స్థానంలోకి ఒకరు మారిపోతారు. ఆ తర్వాత తన అసలైన భార్యను ఓ వ్యక్తి వెతకడం చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. కామెడీతో పాటు హృదయాలను హత్తుకునే సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయి.

టిల్లు స్క్వేర్ కూడా..

తెలుగు కామెడీ థ్రిల్లర్ టిల్లు స్క్వేర్ కూడా ఈ అర్ధరాత్రి (ఏప్రిల్ 26) నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయింది. మార్చి 29న రిలీజైన ఈ మూవీ ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రూ.125 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. మల్లిక్ రామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీని కూడా ఏప్రిల్ 26 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles