పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. రాబడిన సమాచారం మేరకు రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈ ఉదయం పోలీసులు అనుమానితులను తనిఖీ చేశారు. వారి నుంచి ఏకంగా 6 కేజీల 92 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను పశ్చిమ గోదావరి ఎస్పీ రవి ప్రకాశ్ వెల్లడించారు. అక్రమంగా బంగారాన్ని రవాణ చేస్తున్న వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ బంగారాన్ని సంబంధిత శాఖకు పంపిస్తామని పేర్కొన్నారు.