సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్‌ శివారులోని ఎస్‌బీ ఆర్గానిక్స్‌ కెమికల్‌ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఆయిల్‌ బాయిలర్‌ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పరిశ్రమ డైరెక్టర్‌ రవితోపాటు కార్మికులు ఆరుగురు దుర్మరణం చెందారు. ఇవాళ బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.