తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ వద్ద రోడ్డు ఈ ప్రమాదం జరిగింది. ఎదురురెదురుగా వస్తున్న కారు, లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఏటునాగారం నుంచి వేములవాడకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.