యాచకురాలి దారుణ హత్య

హైదరాబాద్ లో(Hyderabad Crime) దారుణం జరిగింది. ఎల్బీనగర్ పరిధిలో ఓ యాచకురాలిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌ సమీపంలో యాచకురాలను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. దుండుగులు యాచకురాలి గొంతు కోసి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.