సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుడికి మొదటి పండుగ సందర్భంగా సుమారు 300 రకాల పిండి వంటలతో అత్తింటివారు సర్‌ప్రైజ్ చేశారు. అనకాపల్లి హోల్సేల్ రైస్ మర్చంట్ గూండా సాయి గోపాల్ రావు కుమార్తె రిషితను విశాఖపట్నం ఎస్ఎల్వీ జువెలరీస్ అధినేత దేవేంద్రనాథ్‌కు ఇచ్చి డిసెంబర్‌లో వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత తొలి పండుగ కావటంతో ఇంటికి వచ్చారు. దీంతో కొత్త అల్లుడికి రాచ మర్యాదలు చేశారు. 300 పైగా పిండి వంటలను తయారు చేయించి, అల్లుడిని సర్‌ప్రైజ్ చేశారు గోపాల్ రావు.