దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాకు పెద్దన్న లాంటి వారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ లో 56 వేల కోట్ల రూపాయల పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో పాల్గొన్న మోదీకి రేవంత్ రెడ్డి పలు విజ్ఞప్తులు చేశారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలని, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరించాలని మోదీని కోరారు. ఈ క్రమంలోనే మోదీ నిర్ణయాలు, ఆయన వ్యవహారశైలిపై రేవంత్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు.