posted on Mar 28, 2024 4:49PM
ఆ పరిసర ప్రాంతాలలోని మరిన్ని గోడౌన్లలో కుక్కర్లు, ఫ్యాన్లతో పాటు నోట్ల కట్టలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. విషయం బయటపడగానే వాణిజ్య పన్నుల శాఖ అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే మీడియాను అనుమతించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. వాటన్నిటికీ బిల్లులు ఉన్నాయంటూ అధికారులు చెప్పడంపై తెలుగుదేశం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు.
ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారంటూ నిలదీస్తున్నారు. వెంటనే ఎస్పీ, కలెక్టర్ స్పందించి చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశేషమేమిటంటో ఆ గోడౌన్లో డమ్మీ ఈవీఎంలు కూడా ఉన్నాయి. దీంతో ఎన్నికలలో ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడేందుకు వైసీపీ తెగించేసిందో అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.