Site icon janavahinitv

రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద మహరాజ్ కన్నుమూత

ఆయన మరణానంతరం ప్రధాని ఎక్స్ లో ఒక సందేశంలో తన సంతాపాన్ని తెలియజేశారు. ‘రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ గౌరవనీయ అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహరాజ్ తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు, సేవకు అంకితం చేశారు. లెక్కలేనన్ని హృదయాలు, మనసులపై చెరగని ముద్ర వేశారు. ఆయన కరుణ, వివేకం తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. కొన్నేళ్లుగా ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. 2020లో బేలూరు మఠానికి వెళ్లినప్పుడు ఆయనతో మాట్లాడాను. కొన్ని వారాల క్రితం కోల్ కతాలో కూడా ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశాను. బేలూరు మఠంలోని అసంఖ్యాక భక్తులతో నా ఆలోచనలు ఉన్నాయి. ఓం శాంతి’ అని మోదీ ట్వీట్ చేశారు.

Exit mobile version