ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ‘చలో అసెం బ్లీ’కి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిధులను సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ప్రాంగణ గేట్ల వద్ద పోలీసులకు-సర్పంచులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. పలువురు సర్పంచులని లాక్కెళ్లి పోలీసులు బస్సుని ఎక్కించారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh | ఏపీ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జి
Related Posts
Akbaruddin Owaisi on Modi | చొరబాటుదారులం కాదు మోదీ.. దేశాన్ని అలంకరించాం
భారత దేశాన్ని అద్భుతంగా అలంకరించామని ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తామేమీ చొరబాటు దారులం కాదని bjpకి కౌంటర్ ఇచ్చారు. ఈ దేశానికి తాము చెందుతామని, తమ దేశమని, ఎప్పటికీ తమదే అవుతుందని తెలిపారు.
Pawan Kalyan nomination in Pitapuram | పవన్ నామినేషన్.. పిఠాపురంలో భారీ ర్యాలీ
కాసేపట్లో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయల్దేరారు. పవన్ నామినేషన్ సందర్భంగా జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు…