Home ఆంధ్రప్రదేశ్ IPS Officers Suspended : ముంబయి నటి కేసు-ముగ్గురు ఐపీఎస్ లపై ఏపీ సర్కార్ సస్పెన్షన్...

IPS Officers Suspended : ముంబయి నటి కేసు-ముగ్గురు ఐపీఎస్ లపై ఏపీ సర్కార్ సస్పెన్షన్ వేటు

0

వైసీపీ నేతపై కేసు నమోదు

ముంబయి నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్ చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి, చిత్ర హింసలకు గురి చేశారని తల్లిదండ్రులు, న్యాయవాదులతో కలిసి ముంబయి నటి ఇటీవల ఇబ్రహీంపట్నం పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌, మరికొందరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, నటిని వేధించిన పోలీసులపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Exit mobile version