పంట పొలాలు, విధుల్లో కరెంట్ వైర్లు వేలాడటం ఎక్కువ మంది ప్రజలతో పాటు విద్యుత్ సిబ్బంది షాక్ కు గురైన ఘటనలు తన దృష్టికి వచ్చాయని మంత్రి తెలిపారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లపై శ్రద్ధ వహించాలని, ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి రవికుమార్ ఆదేశించారు. విద్యుత్ లైన్ల మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే తక్షణనే సమస్యను పరిష్కారించాలని ఆదేశించారు. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. కరెంట్ షాక్ తో మరణించిన వారికి పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం ప్రభుత్వ విధానం కాదని, ప్రమాదాలు జరగకుండా నివారించడమే తమ పని అన్నారు. నష్టపోయిన ప్రతీ కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.