ఓం భీమ్ బుష్ స్టోరీ బ్యాక్డ్రాప్
నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్కు తగ్గట్టే క్రేజీ కామెడీతో ఓం భీమ్ బుష్ స్టోరీ ఉంటుంది. సైంటిస్టులమని చెప్పి భైరవపురం గ్రామానికి వెళతారు క్రిష్ (శ్రీ విష్ణు), మాధవ్ (రాహుల్ రామకృష్ణ), వినయ్ (ప్రియదర్శి). ఆ గ్రామంలో చాలా సమస్యలను పరిష్కరిస్తుంటారు. దీంతో సంపగి మహల్లో ఉండే నిధి తీసుకురావాలని వారికి చాలెంజ్ ఎదురవుతుంది. దీంతో దెయ్యం ఉండే ఆ మహల్లోకి ఆ ముగ్గురు వెళతారు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఆ మహల్ వెనుక ఉండే మిస్టరీ ఏంటి.. వారికి నిధి దక్కిందా? అనేది ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటుంది.