రామ్చరణ్ అనుకున్నారు…
పూజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వసు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షికా దేశ్ముఖ్లు అశ్వత్థామ సినిమాను నిర్మిస్తున్నాడు. సచిన్ రవి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వరల్డ్ వైడ్గా త్వరలోనే థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. తొలుత ఈ మైథలాజికల్ మూవీలో హీరోగా విక్కీ కౌశల్ను అనుకున్నారు.డేట్స్ సర్ధుబాటు కాక అతడు తప్పుకోవడంతో రామ్చరణ్, యశ్తో పాటు చాలా మంది సౌత్ హీరోల పేర్లు వినిపించాయి. చివరకు ఈ అవకాశం షాహిద్కపూర్ను వరించింది.దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ మైథలాజికల్ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.