కర్బూజ వేసవికి ఉత్తమమైన పండు. శరీరంలో నీటిశాతం మెయింటెయిన్ చేయడంలో చాలా సహాయపడుతుంది. అలాగే ఈ పండు వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కంటి ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి, పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఈ పండు ఎంతగానో సహకరిస్తుంది. అయితే పండ్లను కోసేటప్పుడు మనం ఎలాంటి ఆలోచన లేకుండా గింజలను పారేస్తాం. ఇకపై విత్తనాలను ఎప్పుడూ విసిరేయవద్దు. ఈ గింజలను తినడం వల్ల శరీరానికి ప్రయోజనాలు ఉన్నాయి.