బియ్యంతో చేసే వంటకాలు టేస్టీగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. దీనిలో ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్ వంటివి ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. సగ్గుబియ్యం తినడం వల్ల శరీరానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. పిల్లలకు సగ్గుబియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఫోలేట్ ఉంటుంది. కాబట్టి మెదడుకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సగ్గుబియ్యంతో చేసిన గారెలు కూడా పిల్లలకి అప్పుడప్పుడు తినిపించండి. ఈ సగ్గుబియ్యం కేసరిలో ఫుడ్ కలర్ వేయడం మీకు ఇష్టం లేకపోతే దాన్ని దూరం పెట్టవచ్చు. కాకపోతే కేసరి రంగు తెలుపుగా వస్తుంది. రుచి మాత్రం ఏమాత్రం మారదు. ఆరంజ్ ఫుడ్ కలర్ వేయాలా వద్దా అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.