What is GPS toll collection system : దేశంలో ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థ స్థానంలో జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టెమ్ని తీసుకురావాలని.. కేంద్రం గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఆయన మాటలు వింటుంటే.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఫాస్టాగ్స్ పని చేయవు అన్న సూచనలు కనిపిస్తున్నాయి!