జులై 6న ఇండియా, జింబాబ్వే మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత జులై 7, జులై 10, జులై 13, జులై 14వ తేదీల్లో మిగిలిన నాలుగు టీ20లు జరుగుతాయని బీసీసీఐ తెలిపింది. ఇండియా సిరీస్ నిర్వహిస్తుండటం చాలా థ్రిల్ గా ఉందని జింబాబ్వే క్రికెట్ ఛైర్మన్ తావెంగ్వా ముకులానీ అన్నారు. 2010 తర్వాత జింబాబ్వేలో టీమిండియా ఆడబోతున్న ఐదో ద్వైపాక్షిక సిరీస్ ఇది.