Home ఎంటర్టైన్మెంట్ ఫోర్ ఇయర్స్ అంటున్న బన్నీ..గుంటూరు కారం థియేటర్స్ లో ఉండగా వైరల్ అవుతున్న పోస్ట్

ఫోర్ ఇయర్స్ అంటున్న బన్నీ..గుంటూరు కారం థియేటర్స్ లో ఉండగా వైరల్ అవుతున్న పోస్ట్

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun)సినీ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఎన్నో సినిమాల్లో ఒకటి అల వైకుంఠపురములో(Ala Vaikunthapurramuloo) 2020 సంక్రాంతి కానుకగా జనవరి13 న వచ్చిన  ఆ మూవీ అప్పట్లో బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులని ఒక ఊపు ఊపింది. అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులని కూడా క్రియేట్ చేసిన ఆ మూవీ గురించి బన్నీ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.  

నేటితో అల వైకుంఠపురములో రిలీజ్ అయ్యి నాలుగేళ్లు. 2020 సంక్రాంతి కానుకగా జనవరి12 న ఆ మూవీ విడుదలయ్యింది. అంటే అల వైకుంఠపురములో వచ్చి నిన్నటికి సరిగ్గా నాలుగు సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఆనాటి విషయాలని  గుర్తు  చేసుకుంటు బన్నీ తన ట్విట్టర్ లో ఒక  పోస్ట్ చేసాడు. ఆ అద్భుతమైన ఎంటర్టైనర్ ని ఎప్పటికీ మర్చిపోలేనని మూవీకి సంబంధించిన కొన్ని మేకింగ్ ఫోటోలని కూడా షేర్ చేసాడు.బన్నీ పోస్ట్ చేసిన ఆ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. బన్నీ ఫ్యాన్స్ కూడా వాటిని చూస్తు అల వైకుంఠ పురము థియేటర్ లో చేసిన హంగామాని గుర్తుచేసుకుంటున్నారు.

అల్లు అర్జున్ పవర్ ఫుల్ యాక్టింగ్ కి త్రివిక్రమ్ (trivikram)దర్శకత్వ ప్రతిభ కూడా తోడవ్వడంతో అలవైకుంఠపురము అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించింది. ఆ మూవీలోని పాటలు నేటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్నాయి.గీతా ఆర్ట్స్,  హారికా అండ్ హాసిని క్రియేషన్స్ లపై అల్లు అరవింద్, సూర్య దేవర రాధాకృష్ణ లు అల వైకుంఠ పురానికి నిర్మాతలుగా వ్యవహరించారు.ప్రస్తుతం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ల  మహేష్ వన్ మాన్ షో  గుంటూరు కారం  థియేటర్స్ లో ఉంది.ఈ టైం లో అల్లు అర్జున్ చేసిన ట్వీట్  ప్రాధాన్యతని సంతరించుకుంది. అలాగే గుంటూరు కారంకి(guntur kaaram)త్రివిక్రమే దర్శకుడు.

 

Exit mobile version