Yuvraj Singh: భారత క్రికెట్ జట్టు చివరగా ఐసీసీ ట్రోఫీ గెలిచి పదేళ్లు దాటిపోయింది. 2013 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరే మెగాటోర్నీ టైటిల్ గెలవలేదు టీమిండియా. ఎక్కువగా నాకౌట్ మ్యాచ్ల్లో ఓటమి పాలవుతోంది. కీలక మ్యాచ్లో చేతులెత్తేస్తోంది. గతేడాది వన్డే ప్రపంచకప్లో ఫైనల్లో భారత్ ఓడిపోయి, టైటిల్ చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో భారత జట్టుకు మెంటార్గా ఉండేందుకు మాజీ స్టార్ ఆల్రౌండర్, దిగ్గజం యువరాజ్ సింగ్ ఆసక్తి వ్యక్తం చేశారు. టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టైటిళ్లను గెలవడంలో యువీ కీలకపాత్ర పోషించారు. భవిష్యత్తులో టీమిండియాకు మెంటరింగ్ చేసేందుకు కూడా సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు.