కుళాయి నుంచి వచ్చే నీరు తాగడం మంచిదనే నమ్మకమే ఎక్కువ మందిలో ఉంది. కుళాయి నీరు తాగడం వల్ల వెంటనే ఏం జరుగదు, కానీ దీర్ఘకాలంలో ఏదైనా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. నీటిని శుద్ధి చేసే ఫ్యాక్టరీలలో నీళ్లలోని బ్యాక్టిరియాను చంపేందుకు క్లోరిన్, ఫ్లోరైడ్ లను కలిపి శుద్ధి చేస్తారు. ఆ నీటిని కుళాయిల ద్వారా ప్రజలకు అందిస్తారు. వాటిని నేరుగా మనం పట్టి తాగుతాం. వీటితో వంటలు చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. అయితే ఆ పైపుల్లో నాచు వంటివి పట్టే అవకాశం ఉంది. ఆ నీటిని నేరుగా తాగడం మంచిది కాదు. ఒకసారి కాచి చల్లార్చి తాగడం మంచిది. ముఖ్యంగా చలికాలంలో ఏ నీరైనా కాచ్చి చల్లార్చుకుని తాగడమే ఉత్తమం.