కామారెడ్డి బ్యూరో (జనవాహిణి ప్రతినిధి) :- శనివారం రోజు ఆర్యవైశ్య పెద్దలు ఎమ్మెల్సీ భోగ్గారపు దయానంద్ గుప్త ను ఇటీవలే నూతనంగా కామారెడ్డి ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కో చైర్మన్ విశ్వనాధుల మహేష్ గుప్తా, జాయింట్ సెక్రెటరీ మొగిలిపల్లి భూమేష్ గుప్తా లు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఆర్యవైశ్యుల ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్సీనీ కోరడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ తప్పకుండా భవిష్యత్తులో తన వంతు సహాయ సహకారాలు కామారెడ్డి ఆర్యవైశ్య సంఘానికి అందజేస్తామని తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here